పీసీసీపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

by  |
పీసీసీపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ పదవిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం పోటీ పడే నేతల సంఖ్య రోజురోజుకూ ఎక్కువైపోతుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, కోర్ కమిటీ సభ్యులతో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… పీసీసీ చీఫ్ ఎవరైనా తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. అంతేగాకుండా శుక్రవారం మణికం ఠాగూర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పీసీసీ అభ్యర్థిపై తన అభిప్రాయం చెప్పలేదని అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయమే తన నిర్ణయం అన్నారు.


Next Story

Most Viewed