మరో జిల్లాకు పేరు మార్చనున్న యూపీ సర్కార్

by  |
మరో జిల్లాకు పేరు మార్చనున్న యూపీ సర్కార్
X

ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్.. మరో జిల్లా పేరును మార్చడానికి సిద్ధమవుతున్నది. 2018లో ఫైజాబాద్‌ను అయోధ్యగా, అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్పు చేసిన యూపీ ప్రభుత్వం.. తాజాగా, బస్తీ జిల్లాను వశిష్ట నగర్‌గా మార్చాలని యోచిస్తున్నది. జిల్లా పాలన యంత్రాంగం ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను మొదలుపెట్టిందనిసంబంధిత అధికారులు వెల్లడించారు. తాము బస్తీ జిల్లా పేరును వశిష్ట నగర్‌గా మార్చాలనుకుంటున్నామనీ, దీనికి సంబంధించిన ప్రతిపాదనను గతంలోనే రాష్ట్రప్రభుత్వానికి పంపించామని అధికార బీజేపీ ఎంపీ హర్ష ద్వివేది తెలిపారు. కాగా, రాముడు అయోధ్య నుంచి జనకపురి వెళ్లేటప్పుడు ఈ ప్రాంతలో ఒకరోజు బసచేసినట్టు అక్కడి స్థానికులు నమ్ముతారు. అంతేకాకుండా రాముడి గురువు మహర్షి వశిష్ట కూడా ఇక్కడే గడిపారని విశ్వసిస్తారు.


Next Story

Most Viewed