- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త అన్నారు. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అధికారులతో ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్హంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. భువనగిరి కోటకు రోప్వే, వరంగల్ జిల్లా వాడపల్లి చెరువును అభివృద్ధి చేస్తామని, రీసార్టులు, రహదారిలో సదుపాయాలు, వారసత్వ సంపదను కాపాడుతామన్నారు. చెరువు దగ్గర ఎకో టూరిజం దిశగా అడుగులు వేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఫుట్ బాల్ గ్రౌండ్ల ఏర్పాటు, ఉద్యోగులంతా చేనేత వస్త్రాలను ధరించేటట్లు చూస్తామన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచన మేరకు పర్యాటక రంగాన్ని మరింతగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.