భువనగిరి కోటకు రోప్​వే: ఉప్పల శ్రీనివాస్​ గుప్త

by  |
భువనగిరి కోటకు రోప్​వే: ఉప్పల శ్రీనివాస్​ గుప్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల​ శ్రీనివాస్​గుప్త అన్నారు. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అధికారులతో ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్హంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. భువనగిరి కోటకు రోప్​వే, వరంగల్​ జిల్లా వాడపల్లి చెరువును అభివృద్ధి చేస్తామని, రీసార్టులు, రహదారిలో సదుపాయాలు, వారసత్వ సంపదను కాపాడుతామన్నారు. చెరువు దగ్గర ఎకో టూరిజం దిశగా అడుగులు వేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఫుట్​ బాల్​ గ్రౌండ్ల ఏర్పాటు, ఉద్యోగులంతా చేనేత వస్త్రాలను ధరించేటట్లు చూస్తామన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచన మేరకు పర్యాటక రంగాన్ని మరింతగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Next Story