గద్దెక్కిన సారలమ్మ.. మార్మోగిన వనం

by  |
గద్దెక్కిన సారలమ్మ.. మార్మోగిన వనం
X

మేడారం మహా జాతరలో కీలక ఘట్టం రూపుదిద్దుకుంది. పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలిసి మేడారం గద్దెల పైకి సారలమ్మ చేరుకుంది. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు భక్తి భావంతో పరవశించిపోయారు. సారలమ్మను కన్నెపల్లి ఆలయం నుంచి మేడారంలోని గద్దెపైకి తీసుకొచ్చే క్రమంలో ఆ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అర్ధ రాత్రి 12.25 గంటల సారలమ్మ గద్దెపై కొలువుదీరారు. ఇక గురువారం ఉదయం నుంచి భక్తులు తల్లికి బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా, నేడు సమ్మక్కను పూజరులు గద్దెపైకి తీసుకురానున్నారు. చిలుకలగుట్ట మీద నుంచి సమ్మక్కను కుంకుమభరిణే రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు.



Next Story

Most Viewed