నేడు గద్దె మీదకు రానున్న సమ్మక్క

by  |
నేడు గద్దె మీదకు రానున్న సమ్మక్క
X

మేడారం మహాజాతరలో మరో కీలక ఘట్టం ఆవిషృతంకానుంది. ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లి గద్దె వద్దకు రానున్నారు. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్క తల్లిని పూజారులు కుంకుమ భరణే రూపంలో తీసుకువస్తారు. సమ్మక్క గద్దె మీదకు వచ్చే అపురూప దృశ్యంతో జాతరకు సంపూర్ణత సంతరించుకుంటుంది. ఇప్పటికే మేడారం ప్రాంగణం జన సముద్రంలా మారింది. కాగా, అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఒడిషా తదితర రాష్ట్రాల నంచి భక్తులు తరలివస్తున్నారు. మేడారం చుట్టుపక్కల మొత్తం 10 కిలో మీటర్ల మేర వేలాది గుడారాలతో జాతర కుంభమేళను తలిపిస్తుంది.



Next Story

Most Viewed