యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా

by  |
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ యధావిధిగా జరుగుతాయని చెప్పారు. తనను ఇటీవల కలిసిన వారందరూ టెస్టులు చేయించుకుని క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు. తనకు కరోనా సోకినట్లు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉదయం ట్విట్టర్‌లో ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కరోనా బారిన పడినట్లు ప్రకటించారు.


Next Story

Most Viewed