ఆమె ఎవరు.. ఆస్పత్రిలో చేర్చి ఆ ఇద్దరు ఎందుకు పారిపోయారు..?

by  |
unknown girl dead body
X

దిశ, కుత్బుల్లాపూర్ : గుర్తు తెలియని యువతిని ఆస్పత్రిలో చేర్పించి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి శుక్రవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఓ యువతి(20)ని ఆరోగ్యం బాలేదని ఆటోలో తీసుకువచ్చారు.

పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు నిర్ధారించారు. తిరిగి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువచ్చిన ఇద్దరికి అప్పగించేందుకు యత్నించగా వారు కనిపించలేదు. అయితే, ఆ యువతి చేతిపై మెహందీ, కంకణం, గాజులను పరిశీలిస్తే ఇటీవలే వివాహామైనట్లు తెలుస్తోంది. ఎడమ చేయిపై లక్ష్మి అని, మరో చేయిపై ఎం అనే టాటూ ఉంది. హత్య చేసి తీసుకువచ్చారా..? లేక ఇంకెమైనా జరిగిందా తెలియడం లేదు. అసలు ఆ యువతికి సంబంధించిన వారెవరో కూడా తెలియదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధీకులెవరైనా ఉంటే దుండిగల్ పీఎస్‌లో సంప్రదించాలని సీఐ రమణారెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed