డ్రైనేజీలో మృతదేహం.. ఎన్నో అనుమానాలు

by  |
డ్రైనేజీలో మృతదేహం.. ఎన్నో అనుమానాలు
X

దిశ, ఖ‌మ్మం : ఖమ్మం నగరం ఖానాపురం రోడ్డు వద్ద డ్రైనేజీలో ప‌డి ఓ వ్య‌క్తి మృతిచెందిన‌ట్లుగా స్థానికులు గుర్తించారు. ఈ సంఘ‌ట‌న సోమ‌వారం ఉద‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆదివారం రాత్రి యూరిన్‌కి వెళ్లి ప్రమాదవ శాత్తు పడి మృతి చెంది ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి మోటాపురం గ్రామానికి చెందిన మల్లెపల్లి రవి(40) గా పోలీసులు గుర్తించారు. త‌ల‌పై బ‌ల‌మైన గాయం కావ‌డంతోనే మృతిచెందిన‌ట్లుగా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story