మినీ ముంబై వెంచర్‌లో మృతదేహం..!

by  |
మినీ ముంబై వెంచర్‌లో మృతదేహం..!
X

దిశ, పటాన్ చెరు: హైదరాబాద్‌లోని పటాన్ చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ సాయిలు కథనం ప్రకారం.. పటాన్ చెరు మండల పరిధిలోని లక్ష్మారం గ్రామ శివారు మినీ ముంబై వెంచర్ నందు సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి చలనం లేకుండా పడి ఉన్నాడని సమాచారం వచ్చింది.

వెంటనే ఘటనా స్థలికి వెళ్లి చూడగా ఆ వ్యక్తి చనిపోయాడని.. ఆ సమయంలో అతను సిమెంట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. మృతుని కుడిచేతి పై మల్లె చారి అని పచ్చబొట్టు ఉందన్నారు. మినీ ముంబై వెంచర్ మేనేజర్ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


Next Story

Most Viewed