అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ : సారంగి

by  |
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ : సారంగి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రతాప్ సింగ్ సారంగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనా వ్యాక్సిన్‌ను దేశ ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రధాని మోడీ కూడా ఇప్పటికే దీనిపై ప్రకటన చేశారని అన్నారు. కాగా ఒక్కో వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రూ.500 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. భారత సైంటిస్టులు కొన్ని రకాల వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారని అవి క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.


Next Story

Most Viewed