తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు : అమిత్ షా

by  |
తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు : అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 47 స్థానాలను గెలుచుకుంది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. బీజేపీపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అదర్భుతమైన ప్రదర్శన ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అద్భుతంగా కృషి చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి దిశగా వెళుతోందని అన్నారు. గెలుపు కోసం నిత్యం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అంతేగాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసినట్టు సమాచారం. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని కిషన్ రెడ్డిని అభినందించారు.


Next Story

Most Viewed