కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

by  |
కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
X

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కరోనా బారినపడ్డారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారని ట్విట్టర్‌లో స్వయంగా వెల్లడించారు. ఇటీవలే తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారు వెంటనే జాగ్రత్తలు తీసుకుని కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రానా విద్యా శాఖలో పనులకు ఆటంకం కలగదని, జాగ్రత్తలు తీసుకుంటు విధులు నిర్వర్తిస్తానని వివరించారు. ఇటీవలే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed