5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం ఆమోదం

by  |
5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే స్పెక్ట్రమ్ వేలానికి ఆమోదం తెలిపింది. మార్చిలో 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నట్టు ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. అలాగే 20 ఏళ్లకు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5జీ స్పెక్ట్రామ్ వేలానికి అనుమతి ఇచ్చారు. దీని ద్వారా రూ. 3,92,332 కోట్ల ఆదాయం వస్తోందని కేంద్ర కేబినెట్ అంచనా వేసింది. అలాగే చెరుకు రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టన్ను చెరుకుకు రూ. 6 వేల చొప్పున సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే, 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై కూడా రాయితీ కల్పించింది.

Next Story

Most Viewed