ఆటోనగర్‎లో గుర్తు తెలియని యువతి హత్య..!

by  |
ఆటోనగర్‎లో గుర్తు తెలియని యువతి హత్య..!
X

దిశ, బోధన్:

నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని యువతి హత్యకు గురైంది. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సీఐ రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి (25) మృతదేహం లభ్యమైంది. యువతిని హత్య చేసి శరీర భాగాన్ని గోనెసంచుల్లో కట్టి ఆటోనగర్‎లోని నిర్మానుష్య ప్రాంతంలో కాలువ పక్కన పడేశారని తెలిపారు. యువతిని వేరే చోట హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు హంతకులు వాహనాల్లో తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని హత్యగా కేసు నమోదు చేసుకుని యువతి ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నామని అన్నారు. ఈ ఘటన జరిగి రెండు, మూడు రోజుల పైనే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed