షాద్‌నగర్‌లో ఆ వ్యక్తి ఉరెందుకేసుకుండు?

by  |
షాద్‌నగర్‌లో ఆ వ్యక్తి ఉరెందుకేసుకుండు?
X

దిశ, షాద్ నగర్: చెట్టుకు ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం చటాన్ పల్లి గ్రామ శివారులో గల వివేకానంద కళాశాల వెనక ఉన్న వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అటుగా వెళ్తున్న స్థానికులు ఇది గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed