సూర్యాపేటలో విషాదం.. చెరువులో మృతదేహాలు

by  |
సూర్యాపేటలో విషాదం.. చెరువులో మృతదేహాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. సద్దల చెరువులో గుర్తుతెలియని మృతదేహాలు కలకలం రేపాయి. చెరువులో తెలియాడుతున్న ఓ మహిళ, మరో బాలిక మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే, ఇద్దరు కలిసే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story