- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గ్రేటర్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ కాకపోయిన, కేవలం గాంధీనగర్ డివిజన్ నుంచి విజయం తీసుకురావాల్సిందిగా అధిష్టానం ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించింది. కవిత ఇన్చార్జీగా ఉన్న డివిజన్, స్వయంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ సోదరుడి భార్య పద్మ కావడంతో అంతా విజయం లాంఛనమనుకున్నారు.
కానీ, ఫలితాలు వారి అంచనాలను తారుమారు చేయడమే కాకుండా తలొంచుకునేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం గాంధీనగర్లో ముఠా పద్మానరేశ్ దారుణంగా ఓడిపోయారు. కల్వకుంట్ల కవిత తానే అభ్యర్థి అన్న స్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రజల మన్ననను మాత్రం పొందలేకపోయారని స్పష్టమవుతోంది. తొలి ప్రచారం, నామినేషన్ మొదలు నుంచి ప్రచారం ముగిసేవరకు కూడా గాంధీనగర్ డివిజన్ కోసమే కవిత ప్రచారం చేసినా ఆ డివిజన్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.