కొడుకు మృతి.. కోడలితో మామ మ్యారేజ్

by  |
కొడుకు మృతి.. కోడలితో మామ మ్యారేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొడుకు చనిపోవడంతో ఇంట్లోనే ఉంటున్న కోడలిని.. మామ మ్యారేజ్ చేసుకున్న సంఘటన ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా రాజ్‌పుత్‌ సింగ్‌ కుమారుడు గౌతమ్‌ రాజ్‌పుత్. కొన్నేళ్ల క్రితం గౌతమ్‌ రాజ్‌పుత్‌కు ఆర్తిసింగ్ అనే యువతితో వివాహం అయ్యింది. రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో గౌతమ్‌ సింగ్ చనిపోవడంతో అప్పటి నుంచి ఆర్తిసింగ్ మామతోనే కలిసి ఉంటోంది. ఇదే క్రమంలో ఆర్తిసింగ్ మామ కృష్ణా రాజ్‌పుత్.. పెళ్లి విషయాన్ని పెద్దల వద్దకు తీసుకెళ్లాడు. వారు మాట్లాడుకొని ఆర్తిసింగ్ అభిప్రాయం కోరగా ఓకే చెప్పింది. రెండేళ్లుగా తన మామ చూసుకుంటున్న తీరు నచ్చి మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని తెలపడంతో పెద్దలందరూ కలిసి మామ, కోడలుకు వివాహం జరిపించారు.


Next Story

Most Viewed