నిజామాబాద్ జిల్లాలో దారుణం.. అల్లుడిని నరికి చంపిన మామ

by  |
నిజామాబాద్ జిల్లాలో దారుణం.. అల్లుడిని నరికి చంపిన మామ
X

దిశ, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత మామనే అల్లుడిని నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నర్సాపూర్ శివారులోని సోమిడి రాగిడి తండాలో మంచంపై పడుకున్న అల్లుడు శర్మను తన మామ గొడ్డలితో నరికి చంపాడు. మృతుడు భీంగల్ మండలం మెండోరా తండా వాసి. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో తన కూతురిని వేధిస్తున్నందున అతడిని హత్య చేసినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed