- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: సంతానం కలుగని తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. కొంతమందికి పిల్లలు పుట్టినప్పటికీ.. నెలల వ్యవధిలోనే చనిపోతుంటారు. ఇలా ఓ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత భార్య గర్భం దాల్చడం లేదంటూ.. పిల్లలు కావాలని దారుణానికి ఒడిగట్టారు. ఓ అమ్మాయిని అక్రమంగా కొనుగోలు చేసిన భర్త పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇందుకు భార్య కూడా సపోర్ట్ చేయడం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
ఉజ్జయినిలోని కథ్ బరోడాకు చెందిన రాజ్పాల్ సింగ్(38), చంద్రకాంత(26)లు భార్యభర్తలు. వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలు మరణించారు. ఆ తర్వాత పిల్లలు పుట్టలేదు. దీంతో పిల్లలు కావాలన్న ఆశతో తెలిసిన వ్యక్తుల ద్వారా మహారాష్ట్ర నుంచి ఓ యువతిని కొనుగోలు చేశారు. ఇంట్లో నిర్బంధించి ఆమెపై భర్త రాజ్పాల్ పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో సదరు యువతి గర్భం దాల్చింది. గత నెల 25న ఓ శిశువుకు కూడా జన్మనిచ్చింది. ఇదే క్రమంలో కాస్త అనారోగ్యానికి గురైంది. దీంతో నవంబర్ 6న రాజ్పాల్ సింగ్ ఆమెను దేవాస్ బస్టాప్లో వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులు ఆశ్రయించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి రాజ్పాల్ సింగ్, అత్యాచారానికి సహకరించిన భార్య చంద్రకాంతతో పాటు.. బాధిత యువతి కొనుగోలు వ్యవహారంలో సహకరించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మానవ అక్రమ రవాణా కేసు కింద అమ్మాయిని విక్రయించిన ప్రధాన నిందితుడిని కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్నవారికి కోసం గాలింపు చేపట్టామన్నారు.