- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామాంజరం ప్రాంత సరిహద్దున ఉన్న గోదావరి నదిలో జారీ పడి ఇద్దరు యువకుల ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం.. ఆకుల సందీప్(20), కేతన్ మణి కుమార్లు(20) ఆదివారం సాయంత్రం రామాంజరం ప్రాంతంలోని గోదావరి అందాలను చూసేందుకు వెళ్లారు. అయితే నది ఒడ్డుకు దిగి సెల్ఫీలు తీసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరు గోదావరిలోకి దిగారని సమాచారం. దీంతో నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు జారీ నదిలో పడిపోయారు. కొద్ది సేపటికే సందీప్ చేపల వలకు చిక్కుకొని శవమై తేలాడు. ఇది గమనించిన స్థానికులు సందీప్ను ఒడ్డు మీదకు తీసుకు వచ్చారు. అనంతరం కేతన్ మణి కుమార్ కోసం గజ ఈతగాళ్ళు గాలింపు చేపట్టారు. అతని ఆచూకీ లభించలేదు.
చీకటిపడటంతో గాలింపు చర్యలను రేపటికి వాయిదా వేశారు. ఈ క్రమంలో స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటుగా వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు విషయం తెలియడంతో వచ్చి సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని హామి ఇచ్చారు.