గంజాయి మత్తులో రైల్లో అలా చేసిన యువకులు.. షాక్‌లో ప్రయాణికులు

by  |
గంజాయి మత్తులో రైల్లో అలా చేసిన యువకులు.. షాక్‌లో ప్రయాణికులు
X

దిశ, వరంగల్ : గంజాయి మత్తులో రైల్లో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన నెక్కొండ రైల్వేస్టేషన్ వద్ద చోటు చేసుకుంది. అయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గోల్కొండ ఎక్స్ ప్రెస్‌‌లో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యియి. నెక్కొండ నుంచి వరంగల్‌కు రైలు బయల్దేరడంతో గాయాలతో ఉన్న ఇద్దరూ మత్తులో డోర్‌లకు వేలాడుతూ ప్రయాణం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed