- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేండ్లు జైలు శిక్ష విధించింది. ఏయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసినందుకు ఆయనపై 2016లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు కోర్టు.. జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. కాగా ఈ కేసులో హై కోర్టులో అపీల్ చేసుకునేందుకు ఆయనకు కోర్టు అవకాశం ఇచ్చింది.
2016లో ఢిల్లీలో ఆయన 300 మంది కార్యకర్తలతో కలిసి జేసీబీ తీసుకు వెళ్లి ఏయిమ్స్కు చెందిన ఓ సరిహద్దు గోడను ఆయన కూలగొట్టారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు నిరూపించడంతో ఆయనకు రెండేండ్లు జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
Next Story