ఎమ్మెల్యేకు రెండేండ్లు జైలు శిక్ష

by  |
ఎమ్మెల్యేకు రెండేండ్లు జైలు శిక్ష
X

దిశ,వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేండ్లు జైలు శిక్ష విధించింది. ఏయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసినందుకు ఆయనపై 2016లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు కోర్టు.. జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. కాగా ఈ కేసులో హై కోర్టులో అపీల్ చేసుకునేందుకు ఆయనకు కోర్టు అవకాశం ఇచ్చింది.

2016లో ఢిల్లీలో ఆయన 300 మంది కార్యకర్తలతో కలిసి జేసీబీ తీసుకు వెళ్లి ఏయిమ్స్‌కు చెందిన ఓ సరిహద్దు గోడను ఆయన కూలగొట్టారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు నిరూపించడంతో ఆయనకు రెండేండ్లు జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.


Next Story

Most Viewed