భర్తను ఊపిరాడకుండా చేసి హత్య చేసిన భార్య.. అసలేం జరిగిందంటే..?

by Disha Web Desk 4 |
భర్తను ఊపిరాడకుండా చేసి హత్య చేసిన భార్య.. అసలేం జరిగిందంటే..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య హత్య చేసింది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన సాయి రెడ్డి (55) భార్య రాధా హత్య చేసింది. నిద్రలో ఉన్న సాయి రెడ్డిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు గుర్తించారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోని భర్త వేధింపుల నుంచి భరించలేకనే ఈ హత్యకు పాల్పడినట్టు సమాచారం. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, మోపాల్ ఎస్సై గంగాధర్ లు పరిశీలించారు. సాయి రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed