- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అర్ధరాత్రి మూడు ఇండ్లలో చోరీ
దిశ, ఆమనగల్లు ::- ఆదివారం అర్ధరాత్రి మూడు ఇండ్లలో చోరీ జరిగిన సంఘటన ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై బలరాం తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి మేడిగడ్డ గ్రామంలోని విస్లావత్ రమేష్ కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి భోజనం అనంతరం మేడపైకి వెళ్లి పడుకున్నారు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో కిందికి వచ్చి చూడగా రమేష్ ఇంటి తాళాలు పగల కొట్టి ఒకటిన్నర తులం బంగారం, కొంత డబ్బు దొంగలు దోచుకెళ్ళి నట్లు బాధితులు రమేష్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో తండాలోని మరో ఇద్దరి ఇంట్లో దొంగలు పడినట్లు పేర్కొన్నారు. విస్లావత్ వినోద్ కుమార్ ఇంట్లో 10 తులాల వెండి పట్టీలు, కొంత నగదు, రాత్లావత్ సాలి ఇంట్లో తులం బంగారం, కొంత నగదు దొంగలు ఎత్తుకెళ్లి నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై బలరాం సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన ప్రదేశాలను పరిశీలించారు.