కూకట్ పల్లిలో దారి దోపిడీ.. ద్విచక్ర వాహనం అడ్డగించి..!

by  |
basha
X

దిశ, కూకట్ పల్లి : ద్విచక్ర వాహనంపై బిస్కెట్లు అమ్ముకునే వ్యక్తిని అడ్డగించి డబ్బులు లాక్కున్న ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బోయిన్ పల్లికి చెందిన జలాలుద్ధీన్ (41) కూకట్ పల్లి ప్రాంతంలో వీధుల వెంట తిరిగి బిస్కెట్లు అమ్ముకునేవాడు. మంగళవారం మూసాపెట్ ఆంజనేయ నగర్ కాలనీలో ద్విచక్ర వాహనం పై బిస్కెట్లు అమ్ముకునేందుకు కాలనీలో వెళుతున్న జలాలుద్దీన్‌ను ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తి చూపించి బెదిరించారు.

అతని జేబులో ఉన్న 14 వందల రూపాయలు లాక్కుని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరసింగరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఆంజనేయ నగర్ లోపల ఖాళీ ప్రదేశంలో కొంతమంది గంజాయి సేవిస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.



Next Story