- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పెద్దపల్లి : కరోనా భయంతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రోజుల కిందట పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా గ్రామానికి చెందిన పల్లెర్ల మహేష్ అనే యువకుడు కరోనా సోకిందన్న భయంతో బావి హంసపాదుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన స్థానికులు అతన్ని కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడంతో చిన్నారులు కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చింది. పల్లెర్ల మహేష్కు కరోనా పాజిటివ్ రాగా సుల్తానాబాద్ ఐసోలేషన్లో వారం రోజుల పాటు చికిత్స పొందాడు. ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి కొవిడ్ విజృంభించడంతో భయానికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులు వివరించారు.
అదే విధంగా పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్కు చెందిన కనకయ్య అనే వృద్ధుడు కరోనా భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కనకయ్యకు గత ఐదు రోజుల కిందట కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన మంగళవారం కల్వర్టు పిల్లర్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.