దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు దుర్మరణం

by  |
దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, మంథని: ఇసుక క్వారీకి వెళుతున్న ఇసుక లారీ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకపోవడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. లారీ అదుపుతప్పి వరి కోత పనులు పరిశీలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన లారీ పొలంలో కూరుకుపోయింది. ఈ ఘటనలో బిట్టుపల్లి గ్రామానికి చెందిన చిలువేరు గట్టయ్య (60 ) అక్కడికక్కడే మరణించగా, దర్గుల రాజమల్లు (60) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed