ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ‌, చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రేగొండ మండలం బాగిర్తిపేట ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం రాత్రి జ‌రిగింది. వివరాల్లోకి వెళ్లితే.. భూపాలపల్లి మండలం సెగ్గం పల్లి గ్రామానికి చెందిన జిముడ అశోక్ (35) ద్విచక్రవాహనంపై సింగరేణిలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే పంతే రవిశంకర్ (40) తో కలిసి పరకాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు.

అదే సమయంలో వరంగల్ అర్బన్ జిల్లా ఉరుసు గుట్టకు చెందిన వ్యక్తులు కారులో కాళేశ్వరం వెళ్లి అస్థికలు కలిపి తిరిగి హన్మకొండకు వెళుతున్నారు. ఈ క్రమంలో రేగొండ మండలం బాగిరిపేట ఎక్స్ రోడ్డు వద్ద కారు లారీని ఓవర్టెక్ చేస్తున్న క్రమంలో ఎదురెదురుగా వస్తున్నా బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా, రవిశంకర్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed