అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి.. కత్తులతో పొడిచి హత్య..

by  |
అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి.. కత్తులతో పొడిచి హత్య..
X

దిశ, కుత్బుల్లాపూర్ : పాత గొడవలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట డివిజన్ దేవమ్మ బస్తీలో నివాసముండే సురేశ్(25) పెయింటర్ గా పని చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. అయితే పని చేయగా వచ్చిన డబ్బులతో స్నేహితులతో కలిసి మద్యం సేవించడం కొట్లాడుకోవడం పరిపాటిగా మారింది.

ఏమైందో ఏమో శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఆటోలో వచ్చి కత్తులతో సురేశ్ ఛాతి, కడుపులో నాలుగు కత్తి పోట్లు పొడిచి అక్కడి నుండి పరారయ్యారు. స్థానికులు, పోలీసులు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య చేసింది రోషన్, రోహిత్‌ అనే యువకులుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story