Train Accident in Pakistan : ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి

by  |
Train Accident in Pakistan : ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం దక్షిణ పాక్ ఘోట్కీలోని రేతి-ధహార్కీ రైల్వే స్టేషన్ల రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందగా, 50 మంది గాయపడినట్టు సమాచారం.

సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్, మిల్లాట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మిల్లాట్ ఎక్స్‌ప్రెస్‌ను సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. రెండు రైళ్ల మధ్య ప్రయాణీకులు ఇరుక్కున్నట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.


Next Story