సీబీఐ అదుపులో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే

by  |
CBI
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు మంత్రులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన శారదా గ్రూప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీతోపాటు ఎమ్మెల్యే మదన్ మిత్ర, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను అధికారులు సీబీఐ కార్యాలయానికి తరలించారు. శారదా గ్రూప్ కుంభకోణంలో వీరందరిని సీబీఐ విచారించనుంది. అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Next Story

Most Viewed