అదుపు తప్పి.. డివైడర్ ఢీకొని

by  |
అదుపు తప్పి.. డివైడర్ ఢీకొని
X

దిశ, వరంగల్: లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జనగాం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండకు చెందిన చింతల రమేష్ బాబు(45), బానోత్ దేవ్ (25) కారులో హైదరాబాద్ బయలుదేరారు. వారి కారు జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్లలోతు వాగు సమీపంలో అదుపు తప్పి డివైర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ బాబు అక్కడికక్కడే మృతి చెందగా, బానోత్ దేవ్ తీవ్ర గాయలపాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed