స్టేషన్‌ ఘన్‌పూర్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు వ్యక్తులు మృతి

by  |
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు వ్యక్తులు మృతి
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్ మండలం నమిలిగొండ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘన్‌పూర్ నుండి జఫర్‌గఢ్ వైపు వెళుతున్న డీసీఎం నమిలిగొండ శివారులో ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న పాలకుర్తికి చెందిన ఆలకుంట్ల రాజు (36), శివునిపల్లి గ్రామానికి చెందిన రాజు (35) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed