ఘోర ప్రమాదం… ఇద్దరు మృతి

by  |
ఘోర ప్రమాదం… ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న బొలేరో వాహనాన్ని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… విజయవాడలోని మొగల్‌రాజ్‌పురం ప్రాంతానికి చెందిన పల్లబోతు వరుణ్(24), చెల్లెలు మీనాక్షి కారులో ప్రయాణిస్తున్నారు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలోకి రాగానే ఆగివున్న బొలేరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed