కేరళ గోల్డ్ స్మగింగ్ కేసులో ఇద్దరు అరెస్టు

by  |
కేరళ గోల్డ్ స్మగింగ్ కేసులో ఇద్దరు అరెస్టు
X

తిరువనంతపురం: కేరళలో సంచలనం రేపుతున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుంది. స్వప్న సురేష్, సందీప్ నాయిర్‌లను ఎన్ఐఏ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితురాలు సరిత్‌ను కస్టమ్స్ శాఖ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో స్వప్న సురేష్, సందీప్ నాయిర్‌ల పేర్లు వస్తున్నప్పటి నుంచి వీరిరువురు కనిపించడం లేదు. సుమారు 15 కోట్ల విలువచేసే 30 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించిన కేసు దర్యాప్తు ఎన్ఐఏ శుక్రవారం స్వీకరించింది. ఈ కేసులో ఉగ్రవాద కోణమున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా లింక్‌లతోపాటు దేశంలోని ఉగ్రవాదాన్ని పెంచిపోషించే కుట్ర ఈ కేసుతో ముడిపడి ఉన్నదని తెలిపింది.

Next Story

Most Viewed