కరోనాతో ఇద్దరు జర్నలిస్టులు మృతి

by  |
కరోనాతో ఇద్దరు జర్నలిస్టులు మృతి
X

దిశ, నిజామాబాద్: కరోనా కారణంగా ఇప్పటి వరకు ఎంతో మంది జర్నలిస్టులు ప్రాణాలుకోల్పోయారు. అయితే తాజాగా నిజామాబాద్ నియోజకవర్గంలోని ధర్పల్లి పాత్రికేయుడు అల్లాడి శేఖర్ (48) అదేవిధంగా రూరల్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుడు వేణుగోపాల్(49)కరోనాతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం వీరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వీరిద్దరు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు మృతి చెందారు.

వీరి మృతి పట్ల రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు అన్నారు. అలానే మాస్క్ ధరించి శానిటైజర్ తో తరచూ చేతులు శుభ్రపరుచుకోవాలి, ఒకేచోట అందరూ గుమికూడకుండా ఉండాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరంగా వెనుకబడి, కరోనా బారిన పడి మృతి చెందిన పాత్రికేయులను రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్ర మీడియా అకాడమీ అన్ని విధాల ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.



Next Story

Most Viewed