విషాదం.. వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

by  |
Two died
X

దిశ, మహబూబాబాద్: ఆడుకోవడానికి వాగులోకి వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువు ఒడిలోకి వెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన యశ్వంత్(10), సాయి సహస్ర (8)లు అనే ఇద్దరు సాయత్రం సమయంలో ఇంట్లో చెప్పకుండా ఆటకు వెళ్లి సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి తిరిగి రాలేదు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇరు కుటుంబాలు వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న మున్నేరు వాగు ఒడ్డున చెప్పులు కనిపిండంతో అనుమానం వచ్చి గాలించగా, ఒకరి యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. సహస్ర మృతదేహం కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్సై రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed