ఘోర ప్రమాదం.. ఇద్దరు డిగ్రీ విద్యార్థులు దుర్మరణం

by Batti.Sumithra |

<p>దిశ, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకులలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులు సరూర్ నగర్‌ మండలం బాలాపూర్‌కు చెందిన ఆయుష్ పాండే(20), సరూర్‌నగర్‌కు చెందిన అక్షయ్ రెడ్డి(21) గా గుర్తించారు. వీరు డిగ్రీ చదువుతోన్న విద్యార్థులని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం [&hellip;]</p>

road accident
X

దిశ, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకులలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులు సరూర్ నగర్‌ మండలం బాలాపూర్‌కు చెందిన ఆయుష్ పాండే(20), సరూర్‌నగర్‌కు చెందిన అక్షయ్ రెడ్డి(21) గా గుర్తించారు. వీరు డిగ్రీ చదువుతోన్న విద్యార్థులని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Next Story