మాసాయిపేటలో ఒకేరోజు ఇద్దరు మృతి

by  |
మాసాయిపేటలో ఒకేరోజు ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నిర్మలో జిల్లాలో విషాదం నెలకొన్నది. ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కడెం మండలం మాసాయిపేట సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ ను ట్రాలీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతులు మాసాయిపేటకు చెందిన తరుణ్, గంగాధర్ గా గుర్తించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed