కల్తీ మద్యం కలకలం.. చీప్ లిక్కర్ తాగి ఇద్దరు మృతి

by  |
adulterated-alcohol
X

దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం సిద్ధారంలో బెల్ట్ షాపులోని చీప్ లిక్కర్ తాగి రెపని కేశవ రావు, దేరెంగుల వీరయ్య, గుంజి శ్రీను ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురుయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఇద్దరు మృతి చెందారు. గుంజి శ్రీను అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ఈ క్రమంలో బాధితుల కుటంబ సభ్యులు సత్తుపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కల్తీ మద్యం తాగిన కారణంగానే బాధితులు మృతి చెందినట్టు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story

Most Viewed