నగ్నచిత్రాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్

by  |

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరిట జరిగిన వంచన కేసులో ప్రధాన సూత్రధారులు వరుణ్‌, కౌశిక్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, ‘మై నేమ్ ఈజ్ 420’ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలను అప్‌లోడ్ చేసిన యువకుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన యువకుడు వాటిని మరో నలుగురికి పంపినట్టు సమాచారం. దీంతో డెల్టా ప్రాంతానికి చెందిన విద్యార్థితోపాటు అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫొటోలు అందుకున్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Next Story