కొమురం భీం జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు

by  |
coronavirus
X

దిశ, ఆదిలాబాద్: రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా కొమురం భీం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగజ్‌నగర్ మండలం ఈస్‌గావ్ గ్రామంలోని ఓ కుటుంబంలోని భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనిని ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారి కొమరం బాలు ధృవీకరించారు. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన వీరికి పాజిటివ్ రావడం గ్రామంలో కలకలం సృష్టిస్తోంది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 20కి చేరాయి.

Next Story

Most Viewed