ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్న ఆటో

by  |
Road-Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తుగ్గలి మండలం శభాష్ పురం వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఓ కుటుంబం ఆటోలో శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story