విచిత్రం.. ‘పుర’పోరు బరిలో ఒకే ఫ్యామిలీ.. ఒకరు కమలం, మరొకరు గులాబీ..!

by  |
విచిత్రం.. ‘పుర’పోరు బరిలో ఒకే ఫ్యామిలీ.. ఒకరు కమలం, మరొకరు గులాబీ..!
X

దిశ, సిద్దిపేట : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి అంకం నామినేషన్ ప్రక్రియ సజావుగా ముగిసింది. నామినేషన్ ప్రక్రియ చివరి రోజులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని 36వ వార్డుకు జనరల్ మహిళ రిజర్వేషన్‌ను కేటాయించారు. అయితే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్ నెంబర్ 12లో 36వార్డుకు నామినేషన్ దాఖలు చేయడానికి వరుసకు ఇద్దరు అన్నదమ్ములు అయ్యే దరిపల్లి బ్రదర్స్ అయిన ఇద్దరు శ్రీనివాస్‌లు వారి సతీమణిలతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు.

దరిపల్లి చంద్రకళ శ్రీనివాస్ టీఆర్ఎస్ నుండి, దరిపల్లి లావణ్య శ్రీనివాస్‌లు బీజేపీ నుండి నామినేషన్లు వేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేసారి నామినేషన్లు వేయడానికి రావడంతో స్థానికంగా చర్చనీయాంశం అయింది. నిన్నటి వరకు ఒకే ఫ్యామిలీగా ఉన్న ఇరువురు మున్సిపల్ పోల్స్ ప్రచారం, ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారో అని పలువురు చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed