బ్రేకింగ్.. KTR కొడుకు హిమాన్షుపై ట్వీట్ దుమారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు

by  |
బ్రేకింగ్.. KTR కొడుకు హిమాన్షుపై ట్వీట్ దుమారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ రాజకీయ దుమారాన్ని లేపింది. ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ ట్వీట్‌తో టీఆర్ఎస్ నాయకులు సైతం సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగారు.

ఈ క్రమంలో కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల, బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు ట్వీట్ చేశారు. అయితే, హిమాన్షుపై చేసిన ట్వీట్ అభ్యంతరంగా ఉందంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రపంచ అందగాళ్ల జాబితాలో ప్రిన్స్ మహేశ్ బాబు

Next Story

Most Viewed