ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపు ప్రకటించిన టీవీఎస్

by  |
ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపు ప్రకటించిన టీవీఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద టూ-వీలర్ వాహన తయారీ సంస్థ టీవీఎస్ తన బైక్ ధరలను భారీగా తగ్గింది. ఫేమ్ 2 పథకం కింద సబ్సిడీకి అనుగుణంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ. 11,250 తగ్గించినట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ) రూ. 1,12,027 ఉండగా, తగ్గింపు ధరతో రూ. 1,00,777కే లభించనుంది. ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్ 2 పథకమ ద్వారా అందే సబ్సిడీ సవరణకు అనుగుణగా కొత్త ధర నిర్ణయించామని కంపెనీ ఓ ప్రకటనలో వివరించింది. మెరుగైన ప్రోత్సాహకాల ద్వారా దేశీయంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాల అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది.

దీంతో పాటు టీవీఎస్ మోటార్‌సైకిల్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ బైకుపై కూడా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా కొన్నవారికి ఈ మోడల్‌పై రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాంక్ అందించనున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఈ బైకును ఫైనాన్స్ రూపంలో కొనుగోలు చేసినవారికి రూ. 10 వేల వరకు తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 30 వరకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వి మోడల్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. రైడ్ మోడ్‌లో సింగిల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్, డ్రైవింగ్ మోడ్‌లో డ్యుయెల్ ఛానల్ ఏబీఎస్ వేరియంటలలో ఉన్నాయి. వీటి దహ్రలు రూ. 1.29-1.34 లక్షల మధ్య కంపెనీ నిర్ణయించింది.


Next Story