పసుపే బంగారమాయే..

by  |
పసుపే బంగారమాయే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో, పసుపు బోర్డు, మద్దతు ధర కోసం ఇందూర్ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​లో పసుపుకు బంగారం లాంటి ధర పలుకుతోంది. ఈ నామ్ ద్వారా అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. మంగళవారం ఓ లాట్​పసుపు కోసం 18 మంది వ్యాపారులు ఆన్ లైన్ లో కోట్ చేయగా, ప్రతిభ రకం పసుపుకు మాయిశ్చరైజర్ ఉన్నప్పటికీ క్వింటాల్​కు రూ.6589 ధర పలికింది. ఈ లెక్కన మాయిశ్చరైజర్​ ఉన్న ఏసీ 7879 రకానికి మాత్రం రూ.5,400 వరకు పలికింది. ఈ ఏడాది పసుపు ధర రూ.8 వేల వరకు పలుకుతుందని స్థానిక మార్కెట్ అధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే 25,591 క్వింటాళ్ల పసుపు రాక..

ఉత్తర తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​ అతి పెద్దది. ఉత్తర భారతంలోనే అధిక పసుపు పండించినా మార్కెటింగ్​ అయ్యేది మాత్రం ఇక్కడ నుంచే. పసుపుకు మద్దతు ధర కల్పించే విషయం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమ పరిధిలోనికాదని కాలం వెల్లదీస్తున్నాయి. అయినా పసుపు రైతులు పంట పండించడం, సరుకును మార్కెట్​కు తరలించడం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఈ సీజన్ లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​కు 17 వేల క్వింటాళ్లు మాత్రమే రాగా, ఈసారి మంగళవారం వరకు 25,591 క్వింటాళ్లు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్​లో మాయిశ్చరైజర్ పసుపు కు అత్యధికంగా రూ.5400 ధర పలికితే, ప్రతిభ, ఎర్ర గుంటూర్ రకాలకు మాత్రం తేమ తక్కువగా ఉన్నా రూ. 6,589 పలుకుతోంది. గత సంవత్సరం అత్యధిక ధర రూ.5 వేలు మాత్రమే పలికిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ఈ సారి ధర రూ.8 వేలు ఖాయం.!

నిజామాబాద్ ​మార్కెట్​కు జిల్లా నుంచే కాకుండా జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పసుపు పంట వస్తోంది. ఈ సీజన్ లో పసుపు ధర క్వింటాల్​కు రూ. 8 వేల వరకు పలకడం ఖాయమని మార్కెటింగ్​అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​కు నాలుగు లక్షల క్వింటాళ్ల పసుపు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు మద్ధత ధర కోసం పోరాడినా అది కాస్త రూ. 9 వేలు దాటదనే అభిప్రాయాలు ఉన్నాయి. మాయిశ్చరైజర్ పసుపుకు ప్రస్తుత సీజన్ లో రూ. 8 వేల ధర పలకడం రైతులకు శ్రేయస్కరమే. సాంగ్లీ మార్కెట్​లో రాజాపూర్ రకానికి మంచి ధర పలుకుతోంది. తెలంగాణ జిల్లాలకు చెందిన అత్యుత్తమ రకమైన పసుపుకు సాంగ్లీ వ్యవసాయ మార్కెట్​కు ధరలో రూ. వెయ్యి తేడా వరకు ఉంటుంది. కానీ, రవాణా, ఇతర ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే నిజామాబాద్ మార్కెట్​లో వచ్చిన ధరతోపోలిస్తే పెద్దగా తేడా ఉండదు.

తేమ లేని పసుపును తీసుకురావాలి

మాయిశ్చరైజర్ ఎక్కువ ఉన్న పసుపుకు తక్కువ ధర వస్తుంది. మంచి ధర రావాలంటే పసుపును ఉడకబెట్టిన తరువాత మంచిగా ఆరబెట్టి మార్కెట్​కు తీసుకురావాలి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​కి ప్రతి రోజు క్వింటాళ్ల కొద్దీ పసుపు వస్తోంది. ఈ నామ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. మార్కెట్​లో రైతులకు దళారుల బెడద లేకుండా ఏర్పాట్లు చేశాం.

-విజయ్ కిషోర్, నిజామాబాద్ మార్కెట్ ​కమిటీ కార్యదర్శి



Next Story

Most Viewed