నీరు, రోడ్డు.. ఆదివాసి ధర్నా

by  |
నీరు, రోడ్డు.. ఆదివాసి ధర్నా
X

నిర్మల్ జిల్లా కడం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని.. మిర్ది చింత, ఇస్లాంపూర్, అలంపేల్లి, రాణిగూడెంల్లో కరెంట్, రోడ్డు సౌకర్యం కల్పించాలని తుడుందెబ్బ సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో ఈ నెల 28న ధర్నా చేపడతామని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వేంకగారి భూమయ్య అన్నారు. నిర్మల్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. తమ ఆదివాసి గూడెంలకు కరెంట్ సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. కరెంటు, రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉర్వేత ఆనంద్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవ్, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.



Next Story