ఈసారి కూడా ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు..?

by  |
ఈసారి కూడా ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు..?
X

దిశ, ఏపీ బ్యూరో : కరోనా థర్డ్ వేవ్ ప్రభావం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై పడే అవకాశం కనిపిస్తోంది. కొవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలనే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా కరోనా ప్రభావంతో ఏకాంతంగానే అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరిగాయి. అక్టోబర్ 7న ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ సారి కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై టీటీడీ చర్చిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ఓ నిర్ణయాన్ని టీటీడీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed